టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాబోయే సినిమాల్లో “ఓం శాంతి శాంతి శాంతి” (Om Shanti Shanti Shanti) ఒకటి. తరుణ్ భాస్కర్ (Tarun Bhasker), ఇషా రెబ్బ (Eesha Rebba) జంటగా నటించిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ తో పెంచేయగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ కావడంతో సినిమాపై బుకింగ్స్ కూడా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసారు. కానీ బుకింగ్స్ గాని, సోషల్ మీడియాలో రెస్పాన్స్ గాని అనుకున్న విధంగా రావట్లేదన్నది నిజం. ఎందుకంటే ఈ సినిమా ఒక మలయాళ హిట్ సినిమాకి రీమేక్.
మలయాళంలో బసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ నటించిన “జయ జయ జయహే” (Jaya Jaya Jayahe) సినిమాకి రీమేక్ గా “ఓం శాంతి శాంతి శాంతి” తెరకెక్కించారు. సాజివ్ (Saajiv) డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా ఓటిటి లో రిలీజ్ అయింది. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో తెలుగు డబ్బింగ్ ఉన్నా కూడా తెలుగులో మళ్ళీ రీమేక్ చేయడంతో ఈ సినిమా చూడాలన్న ఆసక్తి చాలా మంది ఆడియన్స్ లో కనిపించడం లేదు.
ఒకవేళ ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఒరిజినల్ వెర్షన్ కి చాలా చేంజెస్ ఉండాలి. అక్కడ మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ఈ రీమేక్ లో ఉండాల, ప్లస్ సినిమా క్లైమాక్స్ చాలా వరకు చేంజ్ చేసి గుడ్ ఎండింగ్ ఇవ్వాలి. మరి సినిమాలో ఏమేం ఛేంజెస్ చేసారో సినిమా చూస్తే గాని తెలీదు. ఇక తరుణ్ భాస్కర్ కి, అలాగే ఈషా రెబ్బకి మంచి సక్సెస్ ఇపుడు చాలా అవసరం. మరి ఓం శాంతి శాంతి శాంతి వాళ్లకి ఎంత వరకు శాంతినిస్తుందో చూడాలి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
ఇవి కూడా చదవండి :
- ShruthiHaasan : దుల్కర్ మూవీలో క్రేజీ హీరోయిన్… బోల్డ్ గా ఉండబోతున్న క్యారెక్టర్?
- Annagaru Vostaru : డైరెక్ట్ గా ఓటిటి లో వచ్చేసిన “అన్నగారు…
- Border 2 Collection : రికార్డు వసూళ్ల దిశగా బాలీవుడ్ మూవీ… మరో సంచలనం
- TG Govt Jobs Update : నిరుద్యోగులకు శుభవార్త.. దివ్యంగుల కేటగిరీ లో జాబ్స్ ప్రకటన
- Vijay : జననాయగాన్ కు దెబ్బ మీద దెబ్బ.. మళ్ళీ వాయిదా?
