మన పత్రిక, వెబ్డెస్క్: నల్గొండ జిల్లా ( Nalgonda District ) గుర్రంపోడు మండల పరిధిలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. జూనుతల స్టేజి వద్ద రహదారిపై ఓ బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఆడెపు వెంకటయ్య (55) బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
Advertisement
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పసుపులేటి మధు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
