మన పత్రిక, వెబ్డెస్క్: మెదక్ జిల్లా (Medak District) టేక్మాల్ పోలీస్ స్టేషన్లో అవినీతి బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై రాజేష్ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే, ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై, వారి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి సమీపంలోని పంట పొలాల్లోకి పరుగులు తీశారు.
వెంటనే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు, సినిమా ఫక్కీలో ఛేజింగ్ చేసి మరీ ఎస్సైని పట్టుకున్నారు. ఎస్సై రాజేష్ ఏసీబీకి చిక్కారన్న వార్త తెలియగానే, గ్రామస్థులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
