WhatsApp
Advertisement

వందేభారత్ ప్రయాణికులకు గమనిక.. ఆ రూట్‌లో మారిన టైమింగ్స్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: కాచిగూడ – యశ్వంతపూర్ (బెంగళూరు) మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ ఇచ్చింది. ఈ రైలు రాకపోకల సమయాల్లో (హిందూపూర్ స్టేషన్ వద్ద) స్వల్ప మార్పులు చేసినట్లు ప్రకటించింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం.. యశ్వంతపూర్ నుంచి వచ్చే రైలు (20704) హిందూపూర్‌కు ఇకపై మధ్యాహ్నం 3:55 గంటలకు చేరుకుని 3:57కి బయలుదేరుతుంది. అలాగే, కాచిగూడ నుంచి వెళ్లే రైలు (20703) హిందూపూర్‌కు మధ్యాహ్నం 12:17కి చేరుకుని 12:19కి కదులుతుంది. ఈ కొత్త మార్పులు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

Advertisement

నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే వందలాది మంది ప్రయాణికులు ఈ స్వల్ప సమయ మార్పును ముందే గమనించుకుంటే, స్టేషన్లలో రైలు మిస్ అవ్వడం లేదా అనవసరంగా నిరీక్షించే ఇబ్బంది తప్పుతుంది.

బుధవారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.

Advertisement