ప్రతి ఇంటి నిర్మాణానికి 90 రోజుల పాటు ఉపాధి హామీ పనులు జరుపుకోవచ్చు. బేస్మెంట్ వరకు 40 రోజులు, పైకప్పు వరకు 50 రోజులు పనులు చేయొచ్చు. ప్రస్తుతం రోజుకు రూ.307 కూలీ చెల్లిస్తున్నారు. 90 రోజులకు గాను రూ.27,630 వరకు లబ్ధి లభిస్తుంది. ఎంపీడీవోలు అర్హుల జాబితా తయారు చేసి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి.
ఆ తర్వాత జాబితాను గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్కు పంపాలి. నిర్మాణ పనులు మాత్రమే చేపట్టాలి. ఇతర పనులు చేయొద్దని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. పని ప్రగతిపై మూడు స్థాయిల్లో ఫొటోలు లబ్ధిదారుతో కలిపి అప్లోడ్ చేయాలి. పని పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధృవీకరించి చెల్లింపులకు అనుమతించాలి. చెల్లింపు వివరాలు పంచాయతీ బోర్డుపై ప్రదర్శించాలి. లబ్ధిదారుల జాబితాతో రిజిస్టర్ తయారు చేసి సామాజిక తనిఖీలకు సమర్పించాలి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
