మన పత్రిక, వెబ్డెస్క్
కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో(Financial problems) భర్త ఆత్మహత్య చేసుకున్న రెండు నెలలకే అతని భార్య తీవ్ర మనోవేదనకు గురై రెండేళ్ల కుమారుడికి విషమిచ్చి, తానూ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సర్పవరం భావనారాయణపురంలోని గాంధీనగర్లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.
Advertisement
జనపల్లి గోపి అనే ఉద్యోగి కుమారుడి పుట్టినరోజు కోసం రూ. 3 లక్షల అప్పు చేసి, వాటిని తీర్చలేక జులై 22న ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. భర్త మరణంతో కుంగిపోయిన అతని భార్య ఆకాంక్ష, గత నెల 31న తన రెండేళ్ల కుమారుడు సార్విక్తో కలిసి విషం తీసుకున్నారు. కుటుంబసభ్యులు వెంటనే వారిని కాకినాడ జీజీహెచ్లో చేర్చగా, పరిస్థితి విషమించడంతో తల్లీబిడ్డలు బుధవారం మృతిచెందారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
