మన పత్రిక, వెబ్డెస్క్
కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో(Financial problems) భర్త ఆత్మహత్య చేసుకున్న రెండు నెలలకే అతని భార్య తీవ్ర మనోవేదనకు గురై రెండేళ్ల కుమారుడికి విషమిచ్చి, తానూ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సర్పవరం భావనారాయణపురంలోని గాంధీనగర్లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.
Advertisement
జనపల్లి గోపి అనే ఉద్యోగి కుమారుడి పుట్టినరోజు కోసం రూ. 3 లక్షల అప్పు చేసి, వాటిని తీర్చలేక జులై 22న ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. భర్త మరణంతో కుంగిపోయిన అతని భార్య ఆకాంక్ష, గత నెల 31న తన రెండేళ్ల కుమారుడు సార్విక్తో కలిసి విషం తీసుకున్నారు. కుటుంబసభ్యులు వెంటనే వారిని కాకినాడ జీజీహెచ్లో చేర్చగా, పరిస్థితి విషమించడంతో తల్లీబిడ్డలు బుధవారం మృతిచెందారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
