మన పత్రిక, హైదరాబాద్: పసిడి కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ హైదరాబాద్ మార్కెట్లో గురువారం (మార్చి 14) బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. రెండు వారాల వ్యవధిలోనే తులం బంగారంపై ఏకంగా రూ. 10 వేలకు పైగా తగ్గడం గమనార్హం.
ఉదయం 8 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,400 తగ్గి రూ. 1,47,300కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి పసిడి రూ. 1,530 పతనమై రూ. 1,60,690 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర క్రితం రోజు రూ. 10 వేలు పడిపోగా, ప్రస్తుతం రూ. 2.90 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
హైదరాబాద్లో నేటి (మార్చి 14) ధరలు:
| లోహం (పరిమాణం) | తగ్గిన ధర (రూ.) | ప్రస్తుత ధర (రూ.) |
| 22 క్యారెట్ల బంగారం (10 గ్రా) | 1,400 | 1,47,300 |
| 24 క్యారెట్ల బంగారం (10 గ్రా) | 1,530 | 1,60,690 |
| వెండి (1 కిలో) | స్థిరం | 2,90,000 |
అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం రాత్రి స్పాట్ గోల్డ్ 5,130 నుంచి 5,000 డాలర్ల స్థాయికి క్రాష్ అయ్యింది. సిల్వర్ రేటు కూడా 85 నుంచి 80 డాలర్లకు పడిపోయింది. డాలర్ పుంజుకోవడం, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్కు డిమాండ్ పెరగడంతో పాటు ద్రవ్యోల్బణ భయాలతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు సన్నగిల్లడమే ఈ పతనానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
