మన పత్రిక, వెబ్డెస్క్
భారతదేశంలో బంగారం ధర ఈ సంవత్సరం లక్షా 25 వేల రూపాయలకు చేరుతుందని ఐసిఐసిఐ బ్యాంక్ తన సరికొత్త నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ధరల పోకడలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాను రూపొందించారు. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బలహీనపడటం, అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం, ఫెడ్ వడ్డీ రేట్లలో సడలింపు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలను భారీగా పెంచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) వైపు మొగ్గు చూపుతున్నారు. 2025 జూలైలో రూ. 12.6 బిలియన్ల నికర పెట్టుబడిని మదుపరులు గోల్డ్ ETFల్లో పెట్టారు. గోల్డ్ ETFల్లో పెట్టుబడి పెరగడం బంగారం పట్ల పెట్టుబడిదారుల నమ్మకాన్ని సూచిస్తోంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో పెట్టుబడి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ అంచనా ప్రకారం, బంగారం ధరలు ఇప్పటి స్థాయి నుంచి మరింత పెరిగి లక్షా 25 వేల స్థాయికి చేరుకుంటాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
