AP Fire Accident : బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది.
రాయవరంలో ఉన్న గణపతి బ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేసే కార్మికుల్లో ఆరుగురు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.
Advertisement
ఫైర్ యాక్సిడెంట్ అయిన సమయంలో కంపెనీలో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే పరిశ్రమలోని వస్తువులు మొత్తం కాలి బూడిదయ్యాయి.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
