Telangana Colleges Bandh fathi : తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేట్స్ ఫెడరేషన్ (FATHI) ప్రకటన రాష్ట్ర విద్యారంగానికి పెద్ద ఎదురుదెబ్బ. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా విడుదల చేయకపోవడంతో, ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంతో ఈ నెల 15 నుంచి అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మా, ఎంబీఏ, బీఈడీ కాలేజీలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు FATHI ప్రకటించింది. ఈ నిర్ణయం దేశంలో తొలిసారి తీసుకున్నదని FATHI పేర్కొంది. గత కొన్ని నెలలుగా కాలేజీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల్లో ప్రభుత్వానికి చెందిన వాటాను ఇంకా చెల్లించలేదు.
ఈ బకాయిల కారణంగా స్టాఫ్ జీతాలు, ఇతర ఖర్చులు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ అత్యవసర నిర్ణయం తీసుకున్నట్లు FATHI తెలిపింది. ఈ నిరవధిక సమ్మె ఫలితంగా సోమవారం నుంచి విద్యార్థుల తరగతులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. పరీక్షలు, ప్రాక్టికల్స్, ఇంటర్న్ షిప్స్ కూడా ప్రభావితం కానున్నాయి.
FATHI చేసిన ప్రకటన రాష్ట్ర విద్యా వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపనుంది. ప్రభుత్వం త్వరితగతిన జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
