మన పత్రిక వెబ్డెస్క్, వాషింగ్టన్: ఇరాన్తో ఇకపై ఎలాంటి ఒప్పందాలు ఉండవని, ఆ దేశం బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన ఓ కీలక పోస్టు పెట్టారు.
ఇరాన్ లొంగిపోయిన తర్వాతే అక్కడ అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త నాయకుడి ఎన్నిక ఉంటుందని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. మిత్రదేశాలతో కలిసి ఇరాన్ను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటకు తీసుకొస్తామని, గతం కంటే ఆర్థికంగా మరింత బలమైన దేశంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ పోస్టులో తెలిపారు.
అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇరాన్ లో నేరుగా ‘రెజీమ్ చేంజ్’ (ప్రభుత్వ మార్పు) కు అమెరికా పక్కా స్కెచ్ వేసిందన్న సంకేతాలను ఇస్తున్నాయి. ఈ నిర్ణయం భవిష్యత్తులో ప్రపంచ చమురు మార్కెట్లపై, భౌగోళిక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
దీనిపై ఇరాన్ అగ్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
ఇవి కూడా చదవండి :
- సింహ రాశి వారికి రాజయోగం.. ఆ మూడు రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి!
- బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి ఫిక్స్.. లాయర్ ఇంటి అల్లుడు కానున్న యంగ్ హీరో!
- నా కథను నాశనం చేశారు.. వరలక్ష్మి ‘సరస్వతి’ మూవీపై సాయి మాధవ్ ఫైర్!
- ఢిల్లీలో ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్!
- ఎక్కడో క్షిపణుల మోత.. ఇక్కడ వంటింట్లో మంట.. సామాన్యుడిపై వార్ ఎఫెక్ట్!
