TG Warangal: దేవరుప్పుల మండలం పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించే గులాబీ రంగు పురుగులను అరికట్టడానికి లింగాకర్షణ బుట్టలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. చిన్నమడూరు గ్రామంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ.. ప్రతి ఎకరంలో 8 నుంచి 10 బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తేనే మార్కెట్లో అధిక ధర లభించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీఐ రైతులు పాల్గొన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
