Fraud Company : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 330 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన ఓ కంపెనీ తాజాగా బోర్డు తిప్పేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. 4 లక్షలు పెట్టుబడి పెడితే గుంట భూమి ఇస్తామని ఆశ చూపించిన ఓ కంపెనీ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా రూ.330 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
రియల్ ఎస్టేట్ వెంచర్ ఉందని.. అందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఓ కంపెనీ నల్గొండ జిల్లాలోని ప్రజలకు భారీగా ఆశ చూపించింది. 4 లక్షలు పెట్టుబడి పెడితే గుంట భూమి ఇస్తామని, అలాగే రెండేళ్ల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ ఇస్తామని నమ్మబలికారు. రెండేళ్లు పూర్తయ్యాక మరో రూ.8 లక్షలు తిరిగి ఇస్తామని చెప్పారు.
దీంతో చాలామంది జనం 4 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఆ తర్వాత వాళ్లు చెప్పిన విధంగా వడ్డీ ఇవ్వలేదు. రిజిస్ట్రేషన్ అయితే చేశారు కానీ.. భూమి ఎక్కడో చూపించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఆందోళనకు దిగారు. ఆ సంస్థ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ ప్రతినిధులు ఎవ్వరికీ కనిపించకుండా పారిపోయినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
