మన పత్రిక, వెబ్డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన: కోదండరామ్ తిరిగి ఎమ్మెల్సీ అవుతారు
CM Revanth News Kodandaram as MLC
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కొత్త హాస్టళ్లు, డిజిటల్ లైబ్రరీ రూమ్లను ప్రారంభించారు. మరో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రొఫెసర్ కోదండరామ్ను మరో 15 రోజుల్లో తిరిగి ఎమ్మెల్సీగా చేసి శాసన మండలికి పంపుతామని ప్రకటించారు.
బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి కోదండరామ్ పదవిని తీసివేయించారని, దీనిపై రూ. కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.
ఉస్మానియా యూనివర్సిటీని గొలుస్తూ, “1938 సాయుధ రైతు ఉద్యమానికి ఊపిరి పోసింది ఓయూ” అని చెప్పారు. శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి వంటి ప్రముఖులు ఇక్కడి విద్యార్థులేనని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరుడు శ్రీకాంతాచారి కూడా ఓయూ విద్యార్థియే అని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
