మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఈ రోజు రాత్రి ఢిల్లీకి పయనం కానున్నారు. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్తున్నారు.
రేపు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ అంశంపై కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ( TPCC Chief Mahesh Kumar Goud ) , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) , ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
