Car Accident : ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వరుస ప్రమాదాలతో ఏం చేయాలో తెలియక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటేనే వణుకు పుడుతోంది. కారు అయినా, బస్సు అయినా, ఆటో అయినా, బైక్ అయినా, ఏ విధంగా వెళ్లినా ప్రమాదాలు మాత్రం రాకుండా ఉండటం లేదు. తాజాగా హైదరాబాద్ – విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
డివైడర్ ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టింది. అనంతరం ఇంజిన్ కు మంటలు అంటుకోవడంతో క్షణాల్లో కారు కాలి బూడిదైపోయింది. కారుకు మంటలు అంటుకోగానే కారులో ఉన్న 8 మంది ప్రయాణికులు వెంటనే బయటికి రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. అతి వేగంతో వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడం వల్లనే కారుకు మంటలు అంటుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
