TG: తెలంగాణలో పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారుల్లో భయాందోళనలు పెరిగి బంకుల వద్ద బారులు తీరుతున్నారు. దీనివల్ల నగరంలోని ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఆఫీసులు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పెట్రోల్ కొరత వార్తలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో మూడు నెలలకు సరిపడా ఇంధన … Read more

కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్.. పథకాలకు ఇందిరమ్మ పేరెందుకు?

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ కల్లు, గల్ఫ్ కార్మికుల సమస్యలు, ప్రభుత్వ పథకాల పేర్లు, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర తెలంగాణలో ఆల్ఫ్రాజోలం (Alprazolam) కల్తీ కల్లు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ లేని తెలంగాణను నిర్మించాలని డిమాండ్ చేస్తూనే.. మద్యం బ్రాండ్లలాగే … Read more

ITR Filing: కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి ‘ఫామ్ 16’ రద్దు

మన పత్రిక, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి ‘కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు-2026’ అమల్లోకి రానున్నాయి. దీంతో ఐటీఆర్ (ITR) ఫైలింగ్ విధానం సమూలంగా మారబోతోంది. ఇప్పటివరకు ఉద్యోగులకు యాజమాన్యాలు ఇచ్చే ‘ఫామ్ 16’ (Form 16) రద్దు కానుంది. దీని స్థానంలో మరింత పకడ్బందీగా ఉండే ‘ఫామ్ 130’ని ప్రవేశపెడుతున్నారు. కొత్త పన్ను సైకిల్‌లో ‘ఫామ్ 130’ అత్యంత కీలకం కానుంది. … Read more

TGSRTC Ticket Price: బంపర్ ఆఫర్.. ఏసీ బస్సులపై 30% రాయితీ

మన పత్రిక, హైదరాబాద్: నగరంలో పెట్రోల్ కొరత భయంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నగర పరిధిలో తిరిగే మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల టికెట్ ధరలపై ఏకంగా 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు సంస్థ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుత ఇంధన సంక్షోభం, పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు … Read more

Miryalaguda: ఫోన్ చేయగానే స్పందించి రక్తదానం..

మన పత్రిక, మిర్యాలగూడ: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి ప్రాణదాతగా నిలుస్తున్నారు. రక్తం అవసరమైన రోగుల కోసం ఫోన్ చేయగానే తక్షణమే స్పందిస్తూ ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళవారం స్థానిక జ్యోతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక రోగికి రక్తం అవసరం ఉందని తెలియగానే, జానకిరామ్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఇలా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం తనకు ఇది … Read more

కోనరావుపేట పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

మన పత్రిక వెబ్డెస్క్, కోనరావుపేట: చారిత్రక, సాంస్కృతిక విషయాలపై అవగాహన పెంచేందుకు కోనరావుపేట పీ.ఎం.శ్రీ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల విద్యార్థులు వరంగల్ విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా, భద్రకాళి ఆలయం, లక్నవరం సరస్సులను సందర్శించారు. ముఖ్యంగా రామప్ప ఆలయంలోని రుద్రదేవుడు, నందీశ్వరుని విగ్రహాలు, సన్నని దారం దూర్చేంత సూక్ష్మ రంధ్రాలున్న స్తంభాల పనితనం గురించి ఉపాధ్యాయులు వివరించారు. అలాగే, నృత్య భంగిమలను తెలిపే శిల్పాలు, కాకతీయుల శిల్పకళా వైభవం, … Read more

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే

మన పత్రిక, తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026 జూన్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా ఆన్‌లైన్ విడుదల తేదీలను మంగళవారం సవివరంగా వెల్లడించింది. సుప్రభాతం, తోమాల, అర్చన తదితర ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. … Read more

మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి

మన పత్రిక, గువహాటి: గేట్ (GATE) 2026 పరీక్ష ఫలితాలను ఈ నెల (మార్చి) 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహాటి అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి goaps.iitg.ac.in వెబ్‌సైట్ ద్వారా తమ స్కోరును చూసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా గేట్ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం … Read more

నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

మన పత్రిక, నల్గొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేక్యతండా గ్రామపంచాయతీ వస్త్రం తండా వద్ద ఇటుకల లోడుతో వెళ్తున్న ఓ లారీ, ప్యాసింజర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత … Read more

మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం

మన పత్రిక, సిద్దిపేట: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది పండుగ కానుకగా మార్చి 22వ తేదీన ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలివిడత నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద యాసంగికి సంబంధించి మొత్తం మూడు విడతల్లో రూ. 9 వేల కోట్లను రైతుల బ్యాంకు … Read more