మన పత్రిక, వెబ్డెస్క్
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా నిర్వహించనున్నారు. సర్పంచ్ పదవీకాలం 2026 ఏప్రిల్ తో ముగియనుండడంతో, ఎన్నికల ప్రక్రియను ముందస్తుగా ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించారు. అక్టోబర్ 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలి. నవంబర్ 30లోపు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి. డిసెంబర్ 15లోపు రిజర్వేషన్ల కేటాయింపు పూర్తి చేయాలి.
Advertisement
2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని ప్రీ-ఎలక్షన్ షెడ్యూల్ సూచిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలు రాశారు. సమయపాలనతో ఎన్నికల ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
