AP Govt Employees DA Dues Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ ముందే తీపి కబురు అందింది. చెల్లించాల్సిన డీఏ బకాయిలలో మొదటి విడతను ప్రభుత్వం విడుదల చేసింది. సీపీఎస్ ఉద్యోగులకు సోమవారం రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఈ చర్యపై ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన ఉద్యోగులకు కూడా త్వరలో 90 శాతం బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
మొత్తం బకాయిలు ఆరు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు బకాయిలు ఉండడంతో ఈ ప్రక్రియ కొంత సమయం పడుతుంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ కొద్ది మొత్తంలో చెల్లించడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది.
ఇప్పటికే వేతన సవరణ సంఘం, జీతాల పెంపు, డీఏ పెంపు పెండింగ్లో ఉండడంతో ఉద్యోగులు ఆగ్రహంలో ఉన్నారు. దసరా లోపు మొత్తం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
