Ap dsc 2025 appointment letters : రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త. గతంలో అనుకున్నట్టుగా వర్షాలు ఆటంకం కలిగించడంతో వాయిదా పడిన నియామక పత్రాల పంపిణీ ఇప్పుడు ఈ నెల 25న అమరావతిలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు తన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ మొదటి ఫైల్పై సంతకం చేసి డీఎస్సీ ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్-జూలైలో పరీక్షలు నిర్వహించి, ఆగస్టులో ఫలితాలు ప్రకటించారు.
ఇప్పుడు, నియామక పత్రాలు అందుకున్న వెంటనే వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దసరా సెలవుల సమయంలోనే ఈ శిక్షణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దసరా సెలవులు అక్టోబర్ 2న ముగియనుండగా, అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అప్పటికి కొత్తగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు లేకపోతే, ఈ నెల 25న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. వై.సి.పి. ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించకపోగా, చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
