మన పత్రిక, వెబ్డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బార్ పాలసీకి మొదటి అడుగే ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలోని 840 బార్లకు టెండర్లు పిలిచినా, మద్యం వ్యాపారులు స్పందించడం లేదు.
కొత్త పాలసీలోని నిబంధనలు ఆచరణాత్మకంగా లేవని, ఖర్చు భారం పెరుగుతుందని వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలసీలో స్పష్టత లేకపోవడంతో వారు దరఖాస్తులను బహిష్కరించారు. అసలు గడువు ఈ నెల 26న ముగియాల్సి ఉండగా, స్పందన లేకపోవడంతో ప్రభుత్వం గడువును ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. అయినా వ్యాపారుల వైఖరిలో మార్పు లేదు. పాలసీని సవరించకపోతే వారు పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
