రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. తాజాగా వివిధ సంస్థలకు 49.50 ఎకరాల భూమిని కేటాయిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బాసిల్ వుడ్స్, సెయింట్ మేరీస్ స్కూల్, సీఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, బ్యాంకులు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం 12.66 ఎకరాలను కేటాయించారు. గతంలో ఇచ్చిన 42.30 ఎకరాల్లో స్వల్ప మార్పులు చేశారు.
మరోవైపు, ప్రతిష్టాత్మక హైకోర్టు నిర్మాణంలో కీలకమైన ర్యాప్తు (Raft) పనులను మంత్రి నారాయణ గురువారం రాత్రి ప్రారంభించారు. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 52 కోర్టు హాళ్లతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఎనిమిదో అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందని, 2027 చివరి నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
