మన పత్రిక: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఒక గుడ్ న్యూస్ అందించింది. 2026 సంవత్సరానికి గాను జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును బోర్డు అధికారికంగా పెంచింది. ఇంతకుముందు ఉన్న ఫీజు చెల్లింపు చివరి తేదీ ముగియడంతో, ఇప్పుడు ఆ గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చారు.
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలలో ఫెయిల్ అయిన జనరల్ మరియు వొకేషనల్ విద్యార్థులందరికీ ఈ పొడిగించిన అవకాశం వర్తిస్తుంది. ఫీజు డేట్ మిస్ అయిన చాలా మంది విద్యార్థులకు ఇది ఊరటనిచ్చే అంశం. అభ్యర్థులు తమ కాలేజీల్లోనే నేరుగా ఈ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి బహుశా ఇది చివరి ఛాన్స్ కావచ్చు. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే కాలేజీ అధికారులతో కన్ఫర్మ్ చేసుకుని ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 23వ తేదీ లోపు ఫీజు చెల్లిస్తేనే పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
