మన పత్రిక, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు ఈ ఏడాది ముందుగానే వెలువడనున్నాయి. సాధారణంగా మే నెలలో వచ్చే ఈ రిజల్ట్స్, ఏప్రిల్ 20 నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు ఈ పరీక్షలు జరిగాయి. రాబోయే రోజుల్లో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలనే ప్రణాళికల నేపథ్యంలోనే బోర్డు ఈసారి మూల్యాంకన వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది.
విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డ్ ఐడీ ఆధారంగా అధికారిక వెబ్సైట్లు results.nic.in, cbse.nic.in ద్వారా మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు డిజిలాకర్, ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మరోవైపు నూతన విద్యా విధానంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతిలో త్రిభాషా సూత్రం, తొమ్మిదో తరగతికి ఏఐ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ పలు కీలక మార్పులు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
- Alluarjun : AA22xA6 నుంచి క్రేజీ పోస్టర్.. బర్త్డే ట్రీట్ కు కౌంట్డౌన్ స్టార్ట్!
- గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 7 ఎపిసోడ్: మనోజ్ నిజస్వరూపం బయటపెట్టిన డైరెక్టర్
- ఈ నెలాఖరులోగా మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ
- Gold Rate Today – April 7, మంగళవారం బంగారం ధరలు!
- Dacoit Trailer : ధమాకా ట్రైలర్.. శేష్ మాస్ యాక్షన్ అవతార్ తో మాస్ ట్రీట్ రెడీ!
