మన పత్రిక, మిర్యాలగూడ: పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం వారు ఈ గృహ సముదాయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.
మిగిలి ఉన్న మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, ప్లంబింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో, వసతులు కల్పించడంలో ఎటువంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, గృహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
Advertisement
