మన పత్రిక, వెబ్డెస్క్
వినుకొండ: తల్లికి వందనం పథకం ( Thalliki Vandanam ) కింద డబ్బులు అందని వారి ఫిర్యాదులపై చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సీరియస్ అయ్యారు. సోమవారం సిద్ధార్థ నగర్ లో పర్యటించిన సమయంలో పలువురు మహిళలు తమకు నిధులు రాలేదని జీవికి మొరపెట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన జీవి, మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. సర్వే పూర్తిగా ఎందుకు చేయలేదని నిలదీశారు. మళ్లీ ఇలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
అర్హులైన లబ్ధిదారులందరికీ తల్లికి వందనం నిధులు అందేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ను జీవి ఆదేశించారు. పెండింగ్ అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జరిగింది. ప్రభుత్వం ఇటీవల రూ. 325 కోట్లను పెండింగ్ లబ్ధిదారులకు జమ చేయాలని నిర్ణయించింది. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
