మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రానున్న ఆర్థిక సంవత్సరం (FY27)లో కరెంట్ ఛార్జీలు పెంచకూడదని, అలాగే ట్రూఅప్ రూపంలో ప్రజలపై అదనపు భారం వేయకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిస్కమ్లకు ఏర్పడే ₹15,790 కోట్ల రెవెన్యూ లోటును ప్రభుత్వమే భరిస్తుందని ఏపీఈఆర్సీ (APERC)కి లేఖ రాసింది.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 కోట్ల గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. గతంలో ప్రకటించిన విధంగానే 22 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు, మరో 22 లక్షల ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత/రాయితీ విద్యుత్తు పథకాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇక వాణిజ్య వినియోగదారులకు సైతం భారీ ఉపశమనం కలిగిస్తూ, యూనిట్ ధరను ₹12.25 నుంచి ₹9.95కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
