Advertisement

Pension: CPS రద్దు, OPS పునరుద్ధరణకు డిమాండ్‌

సెప్టెంబర్ 1, 2025న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో TGE JAC ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమం కేవలం CPS/UPS రద్దు, OPS పునరుద్ధరణ కోసమే జరిగింది.

TGTTF రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని ప్రసంగించారు. CPS తెచ్చినప్పుడు ఉద్యోగులకు అర్థం కాలేదని, కానీ ఇప్పుడు అది అన్యాయమని అర్థమైందని చెప్పారు.

Advertisement

మాస్ మూవ్మెంట్ లేకుండా ఏదీ సాధించలేమని హెచ్చరించారు. ప్రస్తుతం CPS రద్దు అనేది అన్ని JACలకు, పార్టీలకు ప్రధాన ఎజెండాగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా JAC చైర్మన్ రామారావు, సెక్రటరీ జనరల్ పుల్లయ్య, CPS నాయకుడు తుక్కాని శ్రీనివాస్ రెడ్డి, భూక్య మోహన్ తదితరులు పాల్గొన్నారు

Advertisement