మన పత్రిక, వెబ్డెస్క్
ప్రధాన మంత్రి స్వానిధి యోజన ( PM SVANidhi ) వీధి వ్యాపారులకు ఆర్థిక స్థిరత్వం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబడిన కీలక పథకం. జూన్ 1, 2020న ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు మార్చి 31, 2030 వరకు పొడిగించబడింది. లబ్ధిదారులు ఇప్పుడు రూ. 90,000 వరకు రుణం పొందవచ్చు. ఇది గతంలో రూ. 80,000 గా ఉండేది. ఎటువంటి భద్రత లేకుండా ఈ రుణం అందుబాటులో ఉంటుంది.
రుణం మూడు విడతల్లో అందిస్తారు: మొదటి విడతగా రూ. 15,000, రెండవ విడతగా రూ. 25,000 మరియు మూడవ విడతగా రూ. 50,000. మొత్తం రుణం పొందాలంటే, మొదటి రెండు విడతల రుణాలను పూర్తిగా తిరిగి చెల్లించాలి. రుణం 12 నెలల పాటు వాయిదాలలో చెల్లించాలి. సరిగ్గా చెల్లించిన వారికి తిరిగి రుణం పొందే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. మొబైల్ నంబర్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. e-KYC ద్వారా ధృవీకరణ పూర్తి చేసి, పట్టణ స్థానిక సంస్థ నుండి లేఖ సమర్పించాలి. ఆన్లైన్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వాణిజ్య బ్యాంకులు, RRBలు, SFBలు మరియు సహకార బ్యాంకుల ద్వారా ఈ పథకం అమలవుతోంది. వడ్డీ రేట్లు ప్రస్తుత మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉంటాయి. ఈ పథకం చిన్న వ్యాపారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
