మన పత్రిక, వెబ్డెస్క్
భారతీయ స్టేట్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఆగస్టు 4 మరియు 5, 2025న నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను SBI అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
state bank of india po prelims result 2025
మొత్తం 541 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు SBI వెబ్సైట్లో “Recruitment Results” విభాగానికి వెళ్లి, CRPD/PO/2025-26/04 నోటిఫికేషన్ కింద ఉన్న లింక్పై క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. ఈ పరీక్ష సెప్టెంబర్ 2025లో నిర్వహించనున్నారు. మెయిన్స్ అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. మెయిన్స్ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
sbi po prelims result 2025 link
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
