Advertisement

SBI PO Prelims Result 2025: ఫలితాలు 2025 విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్

భారతీయ స్టేట్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఆగస్టు 4 మరియు 5, 2025న నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను SBI అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Advertisement

state bank of india po prelims result 2025

మొత్తం 541 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు SBI వెబ్‌సైట్‌లో “Recruitment Results” విభాగానికి వెళ్లి, CRPD/PO/2025-26/04 నోటిఫికేషన్ కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. ఈ పరీక్ష సెప్టెంబర్ 2025లో నిర్వహించనున్నారు. మెయిన్స్ అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. మెయిన్స్ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

sbi po prelims result 2025 link

Advertisement