మన పత్రిక వెబ్డెస్క్ : విజయవాడలోని విద్యాధరపురం ‘నేషనల్ ప్లే స్కూల్’లో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదారేళ్ల వయసున్న ఓ పసిపాప ప్రైవేట్ పార్ట్పై యాసిడ్ దాడి జరిగింది. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా బయటపడింది.
చిన్నారి బాత్రూమ్లో జారిపడిందని స్కూల్ యాజమాన్యం కట్టుకథ అల్లి తల్లిదండ్రులకు చెప్పి ఆస్పత్రిలో చేర్పించింది. తీరా చూస్తే అవి యాసిడ్ గాయాలని నిర్ధారణ అయ్యింది. పరువు పోతుందనే నెపంతో ఆస్పత్రి బిల్లులు కట్టి యాజమాన్యం తొలుత ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది.
ప్రస్తుతం ఆ చిన్నారి మూత్ర విసర్జనకు తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.. భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పసిపాప భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్కూళ్లలో పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
పోలీసులు స్పందించి నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
