ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పాటిస్తున్న “జనాభా నియంత్రణ” స్థానంలో ఇప్పుడు “జనాభా నిర్వహణ” (Population Management) దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) మరియు పెరుగుతున్న వృద్ధుల జనాభా దృష్ట్యా, యువ శక్తిని పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సరికొత్త డ్రాఫ్ట్ పాలసీని ప్రవేశపెట్టారు.
ప్రధాన ప్రోత్సాహకాలు ఇవే: ఈ కొత్త విధానం ప్రకారం, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం భారీ ఆఫర్లు ప్రకటించింది.
- నగదు బహుమతి: రెండో బిడ్డ లేదా మూడో బిడ్డ జన్మించిన సమయంలో దంపతులకు ₹25,000 నగదు ప్రోత్సాహకం అందుతుంది.
- పోషణ సాయం: మూడో బిడ్డకు ఐదేళ్ల వరకు నెలకు ₹1,000 చొప్పున పోషకాహార సాయం అందిస్తారు.
- ఉచిత విద్య: మూడో బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందించాలని ప్రతిపాదించారు.
ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు: ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ పాలసీలో మరిన్ని వెసులుబాట్లు కల్పించారు. మూడో బిడ్డ కలిగినప్పుడు తల్లులకు 12 నెలల ప్రసూతి సెలవులు, తండ్రులకు 2 నెలల పితృత్వ సెలవులు (Paternity Leave) ఇవ్వనున్నారు. అలాగే ఇన్ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడే దంపతుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సబ్సిడీ ధరలకే IVF సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎందుకు ఈ మార్పు?
ప్రస్తుతం ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోయింది, ఇది ఉండాల్సిన 2.1 కంటే చాలా తక్కువ. ఇదే పరిస్థితి కొనసాగితే 2047 నాటికి రాష్ట్రంలో 23% మంది వృద్ధులే ఉంటారని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉన్న సమస్యలు మనకు రాకూడదనే ముందుచూపుతో ఈ ‘పోషణ-శిక్ష-సురక్ష’ ప్యాకేజీని ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- నా కథను నాశనం చేశారు.. వరలక్ష్మి ‘సరస్వతి’ మూవీపై సాయి మాధవ్ ఫైర్!
- ఢిల్లీలో ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్!
- ఎక్కడో క్షిపణుల మోత.. ఇక్కడ వంటింట్లో మంట.. సామాన్యుడిపై వార్ ఎఫెక్ట్!
- డీజే టిల్లు’ ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇంట విషాదం.
- విజయవాడలో అమానుషం.. ప్లే స్కూల్ చిన్నారిపై ఘోరమైన యాసిడ్ దాడి!
