WhatsApp
Advertisement

AP Local Body Elections : ఏపీ జడ్పీ ఎన్నికలపై పవన్ కీలక ప్రకటన.

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల ప్రాతిపదికనే జడ్పీ (ZPTC) ఎన్నికలు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఆయన సభలో స్పష్టం చేశారు.

గురువారం బడ్జెట్ పద్దులపై ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల పునర్విభజనపై ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటే ప్రతి మొక్కకు ఇకపై ‘జియో ట్యాగింగ్’ (Geo-tagging) చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ఎర్రచందనం దుంగల విక్రయాల్లో గ్లోబల్ రేట్లు వచ్చేలా ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు.

Advertisement

కొత్త జిల్లాల వారీగా జడ్పీ ఎన్నికలు జరిగితే స్థానికంగా భౌగోళిక, రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. అధికార వికేంద్రీకరణ జరిగి పాలన ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు, స్థానిక నేతలకు కొత్త అవకాశాలు దక్కనున్నాయి.

పంచాయతీరాజ్ శాఖకు రూ.15,485 కోట్ల బడ్జెట్ ను సభ ముందు ప్రతిపాదించారు.

Advertisement