Advertisement

Recharge: జూన్ నుంచి రీచార్జ్ ధరలు పైకి..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: మొబైల్ వినియోగదారులకు త్వరలో మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రముఖ టెలికాం దిగ్గజాలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను మరోసారి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2026 జూన్ నాటికి సుమారు 15 శాతం మేర ఛార్జీల పెంపు ఉండొచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ (Jefferies) అంచనా వేసింది.

గతేడాది ఇప్పటికే సుమారు 30 శాతం మేర ధరలు పెరిగిన విషయం తెలిసిందే. జియో రూ.40 వేల కోట్ల ఐపీవోకు వెళ్తున్న నేపథ్యంలో, పరిశ్రమ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది టెలికాం పరిశ్రమ ఆదాయం 16 శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది.

Advertisement
Advertisement