భారతీయులకి బంగారం (Gold) పైన ఎంత మక్కువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండగైనా, పబ్బమైనా ఒక సగటు సామాన్య కుటుంబీకుడు కొనాలని భావించే మొదటి వస్తువు బంగారం. మూడేళ్ళ కిందటి వరకు ఓ మాదిరిగా మధ్యతరగతి వాళ్లకు అనుకూలంగానే ఉన్న బంగారం ఏడాదిన్నర కాలంగా పెరుగుతున్న తీరు చూస్తుంటే భారతీయులకి చుక్కలు కనబడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లలో ఆడపిల్లలకి బంగారు ఆభరణాల ముచ్చట చేయించలేక ఫ్యామిలీ మ్యాన్స్ ఎంతో ఇబ్బందిపడుతున్నారు.
నిన్నటికి నిన్న కూడా తులం బంగారంపై ఏకంగా 1500 పెరిగింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పది గ్రాముల బంగారం ధర (Gold rate) ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) లో 1,40,460 రూపాయలుగా ఉంది. నిన్నటికి 1,39,310 రూపాయలు ఉండగా దాదాపు 1150 రూపాయలు పెరిగింది. పది గ్రాముల బంగారంపై దాదాపు నెలరోజుల్లోనే పదివేల రూపాయలు పెరగడం గమనార్హం. దీంతో బంగారు ఆభరణాల సేల్స్ కూడా పడిపోయాయి. మళ్ళీ నార్మల్ రావాలంటే కనీసం లక్ష లోపలికి ధరలు దిగి రావాలి. ఆరోజు ఎప్పుడొస్తుందో తెలీదు గాని, దీనికి కారణమవుతున్న అమెరికా (America) గవర్నమేంట్ పై ఇండియన్ (Indian) గవర్నమేంట్ కూడా గట్టిగానే జవాబిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
