మన పత్రిక, వెబ్డెస్క్
Pension vidroha dinam on September 1st – తెలంగాణ రాష్ట్ర ( Telangana State ) ఉద్యోగ జేఏసీ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ TGEJAC పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు.
సెప్టెంబర్ 8 నుండి జిల్లాల మేరకు జేఏసీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ యాత్రల్లో భాగంగా జిల్లా స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, ఉద్యమ కార్యాచరణను బలోపేతం చేస్తారు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 33 జిల్లాల నుండి లక్షలాది ఉద్యోగులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. ఇది పెన్షన్ సమస్యపై ప్రభుత్వానికి బలమైన సందేశం ఇవ్వడానికి ముఖ్యమైన అడుగు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
