మన పత్రిక, వెబ్డెస్క్
Pension vidroha dinam on September 1st – తెలంగాణ రాష్ట్ర ( Telangana State ) ఉద్యోగ జేఏసీ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ TGEJAC పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు.
సెప్టెంబర్ 8 నుండి జిల్లాల మేరకు జేఏసీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ యాత్రల్లో భాగంగా జిల్లా స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, ఉద్యమ కార్యాచరణను బలోపేతం చేస్తారు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 33 జిల్లాల నుండి లక్షలాది ఉద్యోగులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. ఇది పెన్షన్ సమస్యపై ప్రభుత్వానికి బలమైన సందేశం ఇవ్వడానికి ముఖ్యమైన అడుగు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
