మన పత్రిక, వెబ్డెస్క్
కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ( PMVBRY ) అధికారిక పోర్టల్ను ప్రారంభించారు. పోర్టల్ pmviksitbharatrozgaryojana.com ఆగస్టు 18 నుంచి అందుబాటులో ఉంది.
ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు ఎన్రోల్ అయిన కొత్త ఉద్యోగులు, యజమానులు ప్రయోజనాల కోసం పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఉమాంగ్ యాప్ ద్వారా UAN అప్లోడ్ చేయాలి. ఈ పథకం ప్రకారం మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి రూ. 15,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఇది ఒక నెల సగటు వేతనం (బేసిక్ + DA) గా రెండు విడతల్లో చెల్లిస్తారు.
పథకం రెండు భాగాలు: పార్ట్-ఏ (ఉద్యోగులు), పార్ట్-బీ (యజమానులు). యజమానులు కొత్త ఉద్యోగులను నియమిస్తే జీతం ఆధారంగా రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈపీఎఫ్ ( EPFO ) మినహాయింపు సంస్థలకు కూడా పథకం వర్తిస్తుంది. కానీ ECR దాఖలు చేయాలి. ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ ఓపెన్ చేయాలి. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జులై 31 వరకు 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా రూ. లక్ష కోట్లు కేటాయించారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
