Advertisement

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు రకాల అకౌంట్లు క్లోజ్ అయ్యే ఛాన్స్!

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖాతాదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా ఎక్కువ కాలం వినియోగంలో లేని ఖాతాలపై బ్యాంకులు కఠిన చర్యలు తీసుకోనున్నాయి.

వరుసగా రెండేళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగని ‘డోర్మెంట్ ఖాతాలు’, గత 12 నెలలుగా వాడని ‘ఇన్‌యాక్టివ్ ఖాతాలు’, అలాగే చాలా కాలంగా సున్నా బ్యాలెన్స్ ఉండి KYC అప్డేట్ చేయని ఖాతాలపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాయి. నిబంధనల ప్రకారం వీటిని మూసివేసే ప్రమాదం ఉంది. మీ ఖాతా సురక్షితంగా ఉండాలంటే వెంటనే ఒక చిన్న లావాదేవీ (UPI లేదా ATM విత్ డ్రాయల్) చేయాలని, KYC వివరాలు సరిచూసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement