మన పత్రిక, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే యముడిగా మారి ముగ్గురు చిన్నారులను పొట్టనబెట్టుకున్నాడు. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలోనే సురేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మృతులను కావ్య (7), జ్ఞానేశ్వరి (4), సూర్య గగన్ (2)గా గుర్తించారు. సురేంద్ర భార్య ఎనిమిది నెలల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి లేని పిల్లలను తండ్రే చేతులారా చంపేయడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
