మన పత్రిక, వెబ్డెస్క్: బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కిలో వెండి ధర రూ.20 వేలు పడిపోగా, అంతకుముందు అంతే స్థాయిలో పెరిగింది. అయినా జనం ఎగబడి కొంటున్నారు. కొద్ది నెలల్లోనే వెండి రూ.2.50 లక్షలు, బంగారం రూ.1.40 లక్షలు దాటడం సామాన్యులతో పాటు వ్యాపారులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఈ పరుగు ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడు కొనడం సురక్షితమేనా? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.
ధరల పెరుగుదలకు కారణాలివే: ప్రధానంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), 5G టెక్నాలజీలో వెండి వినియోగం పెరగడం వల్లే ఈ డిమాండ్ ఏర్పడింది. వెండి కేవలం ఆభరణంగానే కాకుండా ‘పారిశ్రామిక లోహం’గా మారడమే దీనికి కారణం. మరోవైపు అంతర్జాతీయంగా గనుల నుంచి ఉత్పత్తి తగ్గడం, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి.
నిపుణుల సలహా (70:30 సూత్రం): 2026 నాటికి బంగారం రూ.1.6 లక్షలు, వెండి రూ.3 లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ అంచనా. అయితే, వెండిలో రిస్క్ ఎక్కువ-లాభం ఎక్కువ (High Risk-High Return) కాగా, బంగారం సురక్షితమైన పెట్టుబడి (Safe Bet) అని నిపుణులు చెబుతున్నారు. రిస్క్ తగ్గించుకోవడానికి పెట్టుబడిదారులు తమ మొత్తంలో 70% బంగారంలో, 30% వెండిలో పెట్టడం ఉత్తమమని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
