Advertisement

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 22 డిసెంబర్ 2025 Horoscope in Telugu

నేడు (డిసెంబర్ 22) సోమవారం గ్రహస్థితి ఎలా ఉంది? ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరికి శ్రమ తప్పదు? ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ద్వాదశ రాశుల వారి జాతక చక్రం ఆధారంగా నేటి రాశి ఫలాలను మనపత్రికలో తెలుసుకుందాం.

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారు చేపట్టే పనుల్లో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపార యోగం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు తమ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం మంచిది. ఆర్థిక లాభాలు ఆశాజనకంగా ఉన్నాయి. సూర్య ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

Advertisement

వృషభ రాశి వారికి చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు. కొన్నిసార్లు మనోస్థితి మారుతూ ఉండవచ్చు, కాబట్టి శాంతంగా వ్యవహరించాలి. దుర్గా శ్లోక పఠనం శుభప్రదం.

మిథున రాశి వారు చేపట్టే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులను కలుపుకొని పోవడం మేలు చేస్తుంది. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

కర్కాటక రాశి వారికి ఈరోజు శుభం చేకూరుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఇంటికి సంబంధించి ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. వేంకటేశ్వర స్వామి సందర్శనం కొత్త శక్తినిస్తుంది.

సింహ రాశి వారికి శారీరక శ్రమ పెరిగే సూచనలు ఉన్నాయి. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసరమైన ధనవ్యయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. శని ధ్యానం మేలు చేస్తుంది.

కన్య రాశి వారు చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది. దుర్గా శ్లోకం చదవడం వల్ల శాంతి లభిస్తుంది.

తుల రాశి వారికి భవిష్యత్తు బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది.

వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

ధనుస్సు రాశి వారికి విజయసిద్ధి ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో తోటి వారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. సూర్య శ్లోకం పఠించడం శుభప్రదం.

మకర రాశి వారికి ఇది మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవడం ముఖ్యం. ఈరోజు ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

కుంభ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

మీన రాశి వారు పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకెళ్తే విజయం మీదే. గోవింద నామాలు పఠించడం మంచిది.

Advertisement