మన పత్రిక, వెబ్డెస్క్: వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం చూస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వ ‘అటల్ పెన్షన్ యోజన’ (Atal Pension Yojana – APY) మీకు చక్కటి పరిష్కారం. ఈ పథకంలో చేరడం ద్వారా 60 ఏళ్లు నిండగానే ప్రతి నెలా రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరుగా అకౌంట్ ఓపెన్ చేసి, ఇంటికి రూ. 10,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది.
అర్హతలు & ముఖ్య విషయాలు:
Advertisement
- వయస్సు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. బ్యాంకు ఖాతా తప్పనిసరి.
- పెట్టుబడి: మీరు చేరే వయస్సును బట్టి ప్రతి నెలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో చేరితే తక్కువ ప్రీమియం, ఎక్కువ లాభం ఉంటుంది.
- ఎవరు అనర్హులు?: అక్టోబర్ 1, 2022 తర్వాత వచ్చిన నిబంధనల ప్రకారం, ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించే వారు ఈ పథకంలో చేరడానికి అనర్హులు. కేవలం సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసమే ఈ స్కీమ్ రూపొందించబడింది.
ఇవి కూడా చదవండి :
Advertisement
