మన పత్రిక, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని కౌలు రైతులకు (Tenant Farmers) తీపి కబురు అందించింది. పెట్టుబడి సాయం కింద వారికి కూడా రూ. లక్ష వరకు రుణం (Loan) అందజేయాలని నిర్ణయించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా ఈ రుణాలను మంజూరు చేయనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అధికారులు అర్హులైన కౌలు రైతుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
రుణం పొందేందుకు అర్హతలు & నిబంధనలు:
- కౌలు పత్రం: అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు (CCRC) తప్పనిసరిగా ఉండాలి.
- భూమి: కనీసం ఒక ఎకరం సాగులో ఉండాలి. ఎకరం కంటే తక్కువ ఉంటే రుణం వర్తించదు.
- సభ్యత్వం: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో నివాసం ఉంటూ, ఆ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- చెల్లింపు: తీసుకున్న రుణాన్ని అసలు, వడ్డీతో కలిపి ఏడాదిలోపు తిరిగి చెల్లించాలి. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘాలుగా ఏర్పడి రుణం పొందవచ్చు.
ఎవరికి వర్తించదు? అసైన్డ్ భూములు సాగు చేస్తున్న వారికి, స్థానికేతరులకు ఈ రుణం మంజూరు చేయబడదు. దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు త్వరలోనే వెలువడనున్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
