Advertisement

ఢిల్లీ వెళ్లాల్సిన లోకేశ్ విమానం జైపూర్‌కు మళ్లింపు.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఉత్తర భారతదేశంలో కమ్మేసిన దట్టమైన పొగమంచు (Fog) విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరగా, అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని జైపూర్‌కు (Jaipur) మళ్లించారు.

ఢిల్లీలో పొగమంచు కారణంగా ఇప్పటివరకు దాదాపు 40 విమానాలు రద్దయ్యాయి. మరో 4 విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ఇదే కారణంతో విదేశీ పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీ విమానం కూడా ఆలస్యమైన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement