మన పత్రిక, వెబ్ డెస్క్ః మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క( minister seethakka) సూచించారు. శుక్రవారం ఆమె ములుగు జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా రూ.2.34 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy) మహిళలకు అండగా ఉంటున్నారని, చెక్ డ్యాముల నిర్మాణం వల్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, పశువులకు తాగునీరు లభిస్తుందని మంత్రి అన్నారు. గ్రామ పంచాయతీల్లో పింఛన్ల పంపిణీకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. 100 రోజుల EGS పనులు పూర్తిచేసిన కూలీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్, డీఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
