మన పత్రిక, వెబ్డెస్క్ : Telangana urea news today – తెలంగాణ రైతులకు యూరియా కొరత త్వరలో తీరనుంది. కేంద్ర ప్రభుత్వం 49,275 టన్నుల యూరియాను త్వరలోనే రాష్ట్రానికి పంపనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సరఫరా డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 30,000 టన్నుల యూరియా మాత్రమే నిల్వ ఉంది. రోజుకు 9,000 నుంచి 11,000 టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్కు ఆమోదించిన 1.50 లక్షల టన్నులకు అదనంగా మరో 2.38 లక్షల టన్నుల యూరియా కేటాయింపుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతోంది. ఈ చర్యలతో రైతులకు సకాలంలో యూరియా అందుబాటులోకి రానుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
