WhatsApp
Advertisement

BTech Student Died : ఫోన్‌ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు ఢీకొని యువతి మృతి

BTech Student Died : ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు రావడం గమనించకపోవడంతో.. రైలు ఢీకొని బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కావలిలో ఉన్న ఉదయగిరి బ్రిడ్జి కింద ఫోన్ మాట్లాడుతూ హవిలా షారూన్ అనే బీటెక్ విద్యార్థిని పట్టాలు దాటుతోంది.

అదే సమయంలో కాన్పూర్ – బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ రూట్ లో వెళ్తోంది. విద్యార్థిని ఆ రైలును గమనించకపోవడంతో హవిలాను ఆ రైలు ఢీకొట్టింది. దీంతో హవిలా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హవిలా షారూన్.. కావలిలో ఉన్న వెట్స్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement