Advertisement

యూరియా ఆందోళన: రైతును చెంప మీద కొట్టిన ఎస్ఐ

మన పత్రిక, వెబ్​డెస్క్ : యూరియా కొరతపై తెలంగాణ ( TELANGANA ) రైతుల్లో ఆవేదన ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

నల్గొండ ( NALGONDA ) జిల్లా శాలిగౌరారం, త్రిపురారం మండలాల్లో, సిద్దిపేట నంగునూరు PACS వద్ద, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లోని నర్సింహులపేట, గద్వాల జిల్లా మరికల్ మండలం తీలేరులో రైతులు యూరియా కోసం ధర్నాలు చేపట్టారు. అయితే, యూరియా అడిగిన రైతును చెంప మీద కొట్టిన ఎస్ఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement