మన పత్రిక, వెబ్డెస్క్: మెదక్ జిల్లా (Medak District) టేక్మాల్ పోలీస్ స్టేషన్లో అవినీతి బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై రాజేష్ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే, ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై, వారి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి సమీపంలోని పంట పొలాల్లోకి పరుగులు తీశారు.
వెంటనే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు, సినిమా ఫక్కీలో ఛేజింగ్ చేసి మరీ ఎస్సైని పట్టుకున్నారు. ఎస్సై రాజేష్ ఏసీబీకి చిక్కారన్న వార్త తెలియగానే, గ్రామస్థులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
