మన పత్రిక, వెబ్డెస్క్: సినీ పరిశ్రమను కుదిపేసిన ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న రవిని మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సినీ అగ్ర ప్రముఖులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli), నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పైరసీ భూతాన్ని అరికట్టడంలో పోలీసులు చూపిన చొరవను, వారి సమర్థవంతమైన పనితీరును ఈ సందర్భంగా సినీ పెద్దలు ప్రశంసించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
